telugu navyamedia
రాజకీయ వార్తలు

సైనికులు మృత్యువాతపడటం ఇదే తొలిసారి: విదేశీ మీడియా

china india

ఇండియా, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం హింసాత్మక ఘర్షణకు దారితీశాయి. శాంతి కోసం ఏర్పాటుచేసుకున్న ఇరు దేశాల కమాండర్ల సమావేశం ముగిసి, సైన్యాలను ఉపసంహరించుకుంటున్న తరుణంలో హింస చెలరేగింది. లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో ఇరుదేశాల జవాన్లు పరస్పరం దాడులు చేసుకోవటంతో 20మంది భారత సైనికులు మరణించారు. ఈ ఘటనతో పలు ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

సోమవారం రాత్రి జరిగిన దాడుల్లో 20 మంది భారత సైనికులు, 43 మంది చైనా జవాన్లు మరణించారన్న వార్తలు పలు దేశాలను వణికించాయి. రెండు దేశాలూ అణ్వాయుధాలను కలిగివుండటం, ఏ దేశంలోనూ వెనక్కు తగ్గే ప్రభుత్వాలు లేకపోవడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని విదేశీ మీడియా ఈ విషయంలో ప్రత్యేక కథనాలను ప్రచురించింది.

హిమాలయ పర్వత సానువుల్లోని సరిహద్దుల్లో జరిగిన గొడవలు చాలా సాధారణమేనని, ఆ ప్రాంతంలో శాంతి నెలకొనే ఉందని సర్దిచెప్పుకుంటున్నాయి. 1975 తరువాత, ఇరు దేశాల మధ్యా జరిగిన గొడవల్లో సైనికులు మృత్యువాతపడటం ఇదే తొలిసారని విదేశీ పత్రికలు ప్రముఖంగా వార్తలు ప్రచురించాయి. ఇదే సమయంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజ్జియాన్ మాత్రం తమ వైపు నుంచి జవాన్లు మరణించారని మాత్రం అంగీకరించలేదని “ది వాషింగ్టన్ పోస్ట్” పేర్కొంది.

Related posts