telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనాను ప్రభుత్వం లైట్‌గా తీసుకొంటోంది: అఖిల ప్రియ

bhuma akhila into ycp soon

ఏపీలో కరోనా కేసుల విజృంభనపై టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు. కరోనా మామూలు జ్వరం లాంటిదేనని ప్రభుత్వం లైట్‌గా తీసుకొంటోందని ఆమె విమర్శించారు. వైసీపీ నాయకులు క్వారంటైన్ సెంటర్ల చుట్టూ తిరగడం వల్ల అధికారులు పనులు చేయలేక పోతున్నారని పేర్కొన్నారు.

కర్నూలులో కరోనా కేసులు పెరగడానికి స్ధానిక ప్రజాప్రతినిధులే కారణమన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కరోనా రాయలసీమ అంతటా వ్యాప్తి చెందుతోందన్నారు. రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Related posts