telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మహేశ్ కొత్త సినిమా పోటీలో ముగ్గురు హీరోయిన్స్…

Mahesh

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు 28 సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు రా ఏజెంట్ గా నటించబోతున్నాడని, సినిమాకు మేకర్స్ ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై నెట్టింట్లో హాట్ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి హీరోయిన్ల రేసులో ముగ్గురు ముద్దుగుమ్మలు ఉన్నారు. జాహ్నవి కపూర్, దిశా పటాని, పూజా హెగ్డే… స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న ఈ ముగ్గురు అందగత్తెలలో ఒకరు మహేష్ తో రొమాన్స్ చేసే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. అయితే ఈ చిత్రం కోసం జాన్వీ కపూర్ భారీగా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే దిశా రెండవ ఛాయిస్ అవుతుంది. ఒకవేళ ఇద్దరూ కాకపోతే త్రివిక్రమ్ పూజా హెగ్డేని ఎంపిక చేసే అవకాశం ఉందనేది తాజా సమాచారం.

Related posts