telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్‌…

congress flags

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు అన్ని పార్టీ సిద్ధమవుతున్నాయి.. ఇప్పటికే అభ్యర్థుల జాబితాలు సిద్ధమయ్యాయి.. ఇవాళో.. రేపో.. అన్ని జాబితాలు విడుదల చేయనున్నారు.. అయితే, గ్రేటర్‌ ఎన్నికల్లో తొలి జాబితాను మాత్రం కాంగ్రెస్ పార్టీయే విడుదల చేసింది… మొత్తం 29 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రకటించారు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి… 29 మందితో వెలువడిన తొలి జాబితాలో… 13 మంది మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ.

కాంగ్రెస్‌ అభ్యర్థులు… కాప్రా – పతి కుమార్ , ఏఎస్ రావు నగర్ – శిరీష రెడ్డి , ఉప్పల్ – ఎం. రజిత , నాగోల్ – ఎం. శైలజ , మున్సూరాబాద్ – జక్కడి ప్రభాకర్ రెడ్డి , హయత్ నగర్ – గుర్రం శ్రీనివాస్ రెడ్డి , హస్తినాపురం – సంగీత నాయక్ , ఆర్కే పురం  – పున్న గణేష్ , గడ్డిఅన్నారం – వెంకటేష్ యాదవ్ , సులేమాన్ నగర్ – రిజవనా బేగం , మైలార్‌దేవ్‌పల్లి – శ్రీనివాస్ రెడ్డి , రాజేంద్రనగర్ – బత్తుల దివ్య , అత్తాపూర్ – వాసవి భాస్కర్ గౌడ్ , కొండాపూర్ – మహిపాల్ యాదవ్ , మియాపూర్ – షరీఫ్ , అల్లాపూర్ – కౌసర్ బేగం , మూసాపేట్ – జి. రాఘవేంద్ర , ఓల్డ్ బోయినపల్లి – అమూల్య , బాలానగర్ – సత్యం శ్రీ రంగం , కూకట్‌పల్లి – తేజశ్వర్ రావు , గాజులరామారం – కూన శ్రీనివాస్ గౌడ్ , రంగారెడ్డి నగర్ – గిరగి శేఖర్ , సూరారం – బి. వెంకటేష్ , జీడిమెట్ల – బండి లలిత , నెరేడ్‌మెట్‌ – మరియమ్మ , మౌలాలి – ఉమా మహేశ్వరి , మల్కాజ్‌గిరి – శ్రీనివాస్ గౌడ్ , గౌతంనగర్ – తపస్వాని యాదవ్ , బేగంపేట్ – మంజులారెడ్డి

Related posts