telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కృష్ణా జిల్లా పెడనలో ఓ వృద్ధ తల్లి ఆత్మహత్యాయత్నం…

కృష్ణా జిల్లా పెడనలో ఓ వృద్ధ తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. కన్న కొడుకు సరిగ్గా చూడకపోవడంతో మనస్తాపానికి గురైన తల్లి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. పట్టణ పరిధిలోని బ్రహ్మపురానికి చెందిన వృద్ధురాలు పైడిమర్రి మహాలక్ష్మిని తన కన్న కొడుకులు సరిగ్గా చూడక పోగా, రోజు సూటి పోటి మాటలతో వేధింపులకు గురి చేస్తున్నాడు. దాంతో మనస్తాపానికి గురైన వృద్ధురాలు మహాలక్ష్మి పోలీస్ స్టేషన్ పక్కన గల బల్లకట్టు కాలవలోకి బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. కానీ ఈ విషయం గమనించి కాల్వలోకి దూకి వృద్ధురాలిని సపడరు ఇద్దరు స్థానిక యువకులు. ఆ తర్వాత సంఘటన స్థలానికి వచ్చిన పెడన ఎస్ ఐ మురళి ఆ వృద్ధురాలు దగ్గర నుండి సమాచారం సేకరించారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తన కొడుకుతో మాట్లాడి… ఆమె భాధను తీరుస్తామని పోలీసులు తెలిపారు. అయితే ఈ వార్త తెలిసిన తర్వాత అక్కడ ఉన్న స్థానికులు అందరూ ఆ వృద్ధురాలి కొడుకు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనికిని సరైన బుద్ధి చెప్పాలని సూచిస్తున్నారు.

Related posts