దిశ ఘటనలో నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో అన్నారు. లోక్ సభలో దిశ ఘటనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడుతోందని విమర్శించారు.ఇటువంటి కేసుల్లో విచారణలు సంవత్సరాల తరబడి జరుగుతున్నాయని చెప్పారు.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ ఇటువంటి ఘటనల్లో విచారణలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అయితే, హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనపై మాత్రమే స్పందించాలని రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో జరిగిన వాటిపై మాట్లాడడం ఎందుకని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నించారు. దీంతో రేవంత్ రెడ్డిని ఇక మాట్లాడవద్దని సూచిస్తూ ఓం బిర్లా మరో సభ్యుడికి దిశ ఘటనపై మాట్లాడే అవకాశం ఇచ్చారు.