telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొనసాగుతున్న మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్

muncipal elections telangana

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెల్లడవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మునిసిపాలిటీలోని 1, 2 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించి బోణీ కొట్టింది.

వరంగల్ రూరల్‌లో 12, 17 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 12వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి బి.రాణి గెలుపొందగా.. 17వ వార్డులో పి. గోపి విజయం సాధించారు. పరకాల, చెన్నూరు మునిసిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. పరకాలలో 22 వార్డులకు గాను 11 చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక చెన్నూర్‌లో 18 వార్డులకు 7 చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. 

Related posts