telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు గెలిచినట్టు ఫీలవుతున్నాడు: విజయసాయి

Vijayasai reddy ycp

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడం పై టీడీపీ నేతల వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఎన్నికలను వాయిదా వేయించి చంద్రబాబు గెలిచినట్టు ఫీలవుతున్నాడని ఎద్దేవా చేశారు. ఆరు వారాలు వాయిదా అంటే ఇక ఎలక్షన్లు ఉండవని కాదు బాబూ.నీ కుట్రలన్నింటికీ ప్రజలు తగిన శిక్ష విధించే రోజులు ఎంతో దూరం లేవు’ అని ట్వీట్ చేశారు.

‘పచ్చ పార్టీ నేతలు బయట బాగానే తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్తున్నారు. మీడియా కాన్ఫరెన్సులు పెడుతున్నారు. కరోనా బూచిని చూపి ఎలక్షన్లు మాత్రమే వాయిదా వేయడం మంచి నిర్ణయమట. వీళ్ల వ్యవహారం దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేయ్ అన్నట్టుందని ఎద్దేవా చేశారు.

Related posts