telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ రాజకేయాల్లో హాట్ టాపిక్.. నిమ్మగడ్డ,సుజనా, కామినేని ర‌హ‌స్య భేటీ!

nimmagadda sujana kamineni

ఏపీ రాజకీయాల్లో మరో అంశం చర్చనీయాంశంగా మారింది.ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో రహస్యంగా భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ఫుటేజీని వైసీపీ కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

ఈనెల 13న వీరు సమావేశమైనట్టు వీడియో ఫుటేజి ద్వారా తెలుస్తోంది. ఓవైపు ఎస్ఈసీకి సంబంధించిన కేసు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతున్న సమయంలో ఈ భేటీ జరగడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, కావాలనే ఎవరో ఈ ఫుటేజ్ ని లీక్ చేశారని కొందరు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ మీటింగ్ అంశం రాజకీయంగా దుమారం రేపే అవకాశాలున్నాయి.

Related posts