టీడీపీ మహానాడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు175 సీట్లలో గెలుస్తామని నారా లోకేశ్ ప్రగల్బాలు పలికారని, కానీ టీడీపీకి వచ్చింది మాత్రం 23 సీట్లేనని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
మహానాడులో టీడీపీ నేతలు మాట్లాడుతూ 30 సీట్లలో అభ్యర్థులు లేరని అంటున్నారు. అసలు150 స్థానాలకు టీడీపీ పార్టీకి క్యాండిడేట్లు కష్టమని ఒప్పుకున్నట్టేనా అని సెటైర్లు వేశారు.
నారా లోకేష్, మాజీ మంత్రి యనమల ఇద్దరూ ఎమ్మెల్సీ పదవులను వదులుకోవాలని, త్యాగమూర్తులు అనిపించుకోవాలని విజయసాయిరెడ్డి సూచించారు.
రాజకీయాల్లో పార్టీ వ్యవస్థాపక దినం అనేది పొలిటికల్ పార్టీకి, నేతలకు ఒక ముఖ్యఘట్టం. ఎవరైనా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సంక్షేమం పైన చర్చలు జరుపుతారు. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం చూస్తుంటాం. గెలుపు అసంభవమని అర్థమైంది కాబట్టే ప్రయోజనకర సమీక్షలు లేకుండా ఆత్మస్తుతి, పరనిందలతో మహానాడును జోకర్ల సభలా మార్చాడు చంద్రబాబు అంటూ వరుస ట్వీట్లు చేశారు విజయసాయిరెడ్డి.
దొంగలెక్కల వీసారెడ్డి స్కూల్లో.. సజ్జల శిక్షణ పొందినట్లున్నారు: అనురాధ