telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

డెత్ వారెంట్లపై స్టే..నిర్భయ దోషులకు మరోసారి ఉరి వాయిదా!

nirbaya accuseds

నిర్భయ కేసులో దోషులను నలుగురు దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 1న ఉరి తీసేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్లపై స్టే ఇచ్చింది. దాంతో తొలుత జనవరి 22న ఉరి తీయాలని భావించగా, అది ఫిబ్రవరి 1కి మారింది. ఇప్పుడది కూడా వాయిదా పడింది.

తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఉరి వాయిదా వేయాలని పాటియాలా హౌస్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా తీర్పు వెలువరించారు. దోషులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నందున స్టే ఇవ్వాలన్న దోషుల వాదనలతో ఏకీభవించింది.

Related posts