హైదరాబాద్ ఎల్. బీ. నగర్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త ఆఫర్ ను ప్రకటించారు. 31 వ రోడ్డు భద్రతా వారత్సవాలను పురస్కరించుకొని, బైక్ పై వెళ్తున్న డ్రైవర్ సహా వెనుక వ్యక్తి సైతం హెల్మెట్ ధరించి పయణిస్తే, ట్రాఫిక్ పోలీసులు తమ సొంత ఖర్చుతో ఒక లీటర్ పెట్రోల్ కూపన్లు అందజేశారు.
ఈసందర్భంగా అడిషనల్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాని, ఈ ప్రమాదాల్లో లక్షా యాబై వేలమంది చనిపోతున్నారన్నారు. దీంతో రెండు లక్షల మంది అంగవైకల్యానికి గురవుతున్నారని తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే అరవై శాతం మంది ప్రమాదాల్లో చనిపోతున్నారని తెలిపారు.