ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జనసేన పార్టీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు, తోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అంశంలో జనసేన పార్టీ తొలి నుంచి ఒకే విధానం అవలంబిస్తోందని అన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం మేరకే రాజధాని రైతులు తమ భూములు ఇచ్చారని తెలిపారు. ఇకపై భూసేకరణలు చేపడితే ఏం నమ్మి ప్రజలు భూములిస్తారని ప్రశ్నించారు.
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ,రాజధాని తరలింపు నిర్ణయం వ్యక్తిగత అజెండాతో తీసుకున్న నిర్ణయం అని విమర్శించారు. రాజధానిలో అవినీతి జరిగిందని చెబుతున్న వైసీపీ, విచారణ జరిపి స్కాంలకు పాల్పడిన వారిని శిక్షించాలన్నారు. ఏపీలో రాజధాని వికేంద్రీకరణపై న్యాయపోరాటానికి సమయం ఆసన్నమైందని అన్నారు.
ప్రజావేదిక అక్రమ కట్టడమనడం జగన్ అవగాహనా రాహిత్యం: అనురాధ