telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘గరీబ్ కల్యాణ్’ప్యాకేజ్ తో 80 కోట్ల మందికి సహాయం: కన్నా

Kanna laxminarayana

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ తో రోజువారీ ఉపాధి కూలీలు, రైతులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రోజువారీ కూలీలకు చేయూతనిచ్చింది. ప్రధాని మోదీ ‘గరీబ్ కల్యాణ్’ ప్యాకేజ్ ప్రకటించారు.

‘గరీబ్ కల్యాణ్’ప్యాకేజ్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ హర్షం వ్యక్తం చేశారు. రూ. 1.70 లక్షల కోట్ల ‘గరీబ్ కల్యాణ్’ ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీకి, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో దాదాపు 80 కోట్ల మందికి సహాయం అందుతుందని కన్నా ఓ ట్వీట్ చేశారు.

Related posts