హైదరాబాద్ నగర శివారు శంషాబాద్లో మరో దారుణం చోటుచేసుకుంది. యువతిపై హత్యాచార ఘటన మరువక ముందే అలాంటి ఘాతుకం వెలుగుచూసింది. సిద్దులగుట్ట రోడ్డులో బంగారు మైసమ్మ ఆలయం పక్కన ఓ మహిళ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి స్థానికులు గుర్తించారు.
ఆమెపై అత్యాచారం చేసి హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు మృతదేహంపై కిరోసిన్ పోసి తగులబెట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన జరిగిన ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.