telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

శంషాబాద్‌ : … మరో అత్యాచారం.. హత్య.. తాజా..

another rape and murder case in samshabad

హైదరాబాద్‌ నగర శివారు శంషాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. యువతిపై హత్యాచార ఘటన మరువక ముందే అలాంటి ఘాతుకం వెలుగుచూసింది. సిద్దులగుట్ట రోడ్డులో బంగారు మైసమ్మ ఆలయం పక్కన ఓ మహిళ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి స్థానికులు గుర్తించారు.

ఆమెపై అత్యాచారం చేసి హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు మృతదేహంపై కిరోసిన్‌ పోసి తగులబెట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన జరిగిన ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related posts