telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నాబార్డు సేవలు ప్రశంసనీయం: హరీశ్ రావు

harish rao trs

నాబార్డు సేవలు ప్రశంసనీయమని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్, బంజారాహిల్స్ లోని నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హరీశ్ రావు హాజరయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఒకప్పుడు రైతు కనుకనే రైతుల సమస్యలను ఒక్కోటి ఆయన పరిష్కరిస్తున్నారని చెప్పారు.

ఈ రోజు గోదాముల నిర్మాణంతో పాటు, సూక్ష్మ సేద్యానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ సందర్భంగా నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ 2020-21ని హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు సీజీఎం విజయ్ కుమార్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ మయా, ఆంధ్రాబ్యాంక్ ఈడీ కుల్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts