telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో రబడా తొలిసారి…

సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య దుబాయ్‌లో జరిగిన 47వ ఐపీఎల్ 2020 మ్యాచ్లో సన్ రైజర్స్ 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ భారీ విజయంలో రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్, సాహా, మనీష్ పాండే ముఖ్య పాత్రా పోషించారు. మెహతా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 219 పరుగులు చేయడా ఢిల్లీ 131 కే కుప్పకూలింది. అది వారికి వరుసగా మూడవ ఓటమి. ఈ కారణంగా ఢిల్లీ పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి వెళ్ళింది.

అయితే ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బౌలర్ కగిసో రబడా కు వికెట్ లేని తొలి ఇన్నింగ్స్ ఇదే. ఇప్పటివరకు మొత్తం 30 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన రబడా 54 వికెట్లు తీసుకున్నాడు. కానీ ఈ 30 ఇన్నింగ్స్ లలో ఒక వికెట్ అయిన తోసాడు, కానీ ఈ మ్యాచ్ లో 4 ఓవర్ల వేసి 54 పరుగులు ఇచ్చాడు. కానీ ఒక వికెట్ కూడా తీయలేదు. దాంతో రబడాకు వికెట్ లేని తొలి ఐపీఎల్ మ్యాచ్ ఇదే. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో పరుగుల పరంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధించిన రెండవ అతిపెద్ద విజయం ఇది. ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు అతిపెద్ద విజయం 2019 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ను 118 పరుగుల తేడాతో ఓడించింది.

Related posts