telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

జగిత్యాల యాసిడ్‌ కేసు : అక్రమ సంబంధమే కారణం !

జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాలో స్వాతి అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే బాధితురాలిని మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న జరిగిన ఈ యాసిడ్ దాడి కేసులో దర్యాప్తు వేగవంతం చేసారు పోలీసులు. తిమ్మాపూర్ గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు.. నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో పోలీసులు చాలా అనుమానాలు వస్తున్నాయి. హత్యకు అక్రమ సంబంధమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అక్రమ సంబంధం వల్లనే నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికుల సమాచారం మేరకు తెలుస్తోంది. అయితే… ఈ కేసులో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. యువతి పై యాసిడ్ దాడి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సంఘటనపై జగిత్యాల ఎస్పీ సింధు శర్మతో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత… బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఎస్పీని కోరారు. దీంతో హుటాహుటిన మెట్‌పల్లిలో బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి బయలు దేరారు ఎస్పీ సింధు శర్మ.

Related posts