మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవల పృథ్వీరాజ్ “జన గణ మన” అనే షూటింగ్లో పాల్గొనగా.. అక్కడ ఆయనకు వైరస్ సోకింది. గత మంగళవారం జరిపిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్గా తేలింది. పృథ్వీతో పాటు “జన గణ మన” దర్శకుడు దిజో జోస్ యాంటోనీ, కొంతమంది మూవీ యూనిట్కి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో షూటింగ్ని ఆపేశారు. తాజాగా జరిపిన పరీక్షల్లో పృథ్వీరాజ్ కు కరోనా నెగిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. “యాంటీజెన్ పరీక్షల్లో నెగిటివ్గా తేలింది. కానీ పూర్తిగా కోలుకునేందుకు మరో వారం రోజులు ఐసోలేషన్లో ఉండబోతున్నా. నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన వారందరికీ చాలా థాంక్స్” అని పృథ్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు.
previous post
next post