జగన్ రాష్ట్రాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ప్రభుత్వ విప్, టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న విమర్శించారు. అమరావతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసులు మాఫీ చేయించుకోవడానికి ఎవరి కాళ్లు పట్టుకున్నా అభ్యంతరం లేదన్నారు. కానీ రాష్ట్ర హక్కులు ఇతరుల వద్ద తాకట్టు పెట్టే హక్కు జగన్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు.
కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటని జగన్ మాట్లాడినప్పటి నుంచి ఆయన్ను ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్తో కలిస్తే తప్పేంటన్న జగన్ వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు.ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత జగన్ కోల్పోయారని అన్నారు. జగన్ను ప్రజలు రాష్ట్ర బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు రావని జోస్యం చెప్పారు.