telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం

TRS Leader Gutha Critics Uttam

టీఆర్ఎస్ అభ్యర్ధి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి సుఖేందర్ రెడ్డి మినహా మరెవ్వరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో సుఖేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీ సెక్రటరీ నుండి ఆయన ధృవీకరణ పత్రాన్ని తీసుకొన్నారు.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇతర పార్టీల నుండి నామినేషన్లు దాఖలు కాలేదు.

కేసీఆర్ తన కేబినెట్ లోకి సుఖేంద్ రెడ్డిని తీసుకొంటారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారని చెబుతున్నారు.కేసీఆర్ త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశముంది. సుఖేందర్ రెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డికి మంత్రివర్గంలో చాన్స్ దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

Related posts