telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కరోనా చికిత్స నిమిత్తం చారిటీ సిటీస్ ను వాడుకోవచ్చు: కేఏ పాల్

KA-Paul

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆఫర్ ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో, తనకు చెందిన రెండు చారిటీ సిటీస్ లను బాధితుల చికిత్స నిమిత్తం వాడుకోవచ్చని పాల్ స్పష్టం చేశారు.

తనకు సంగారెడ్డి 300 పడకల సామర్థ్యమున్న చారిటీ సిటీ, విశాఖలో 100 పడకల గదులు ఉన్నాయని తెలిపారు. వాటిని వాడుకుంటే, తనకు ఒక్క రూపాయి కూడా అద్దె చెల్లించనక్కర లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ఆయన, దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలని అన్నారు.

Related posts