తాను ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పానో అదే చేస్తున్నానని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజలకు ఏం హామీలను ఇచ్చానో వాటినే నెరవేరుస్తున్నానని అన్నారు. అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసం చేయడం వంటి పనులు తన జీవితంలో ఎన్నడూ చేయలేదని చెప్పారు. ఈ సందర్భంగా పాదయాత్రలో ఇచ్చిన హామీల వీడియోను జగన్ అసెంబ్లీలో ప్రదర్శించారు.
ఈ క్రమంలో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వం చూపిన వీడియోలను తాము చూశామని, తాము ఇచ్చే వీడియోను కూడా ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. వైసీపీ మేనిఫెస్టోపై ఇరుపక్షాల మధ్యా వాదోపవాదాలు జరుగుతున్నాయి.
అసభ్య పదజాలంతో నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు