telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బానిసలుగా చూడొద్దని రోడ్డెక్కిన ఆశావర్కర్లు..

జీతం ఇస్తున్నారని బానిసలుగా చూడొద్దని ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. నానాటికీ పనిభారాన్ని మోపుతూ నానా చాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖపట్నం గాంధీ విగ్రహం ఎదుట న్యాయంచేయాలని ధర్నా నిర్వహించారు.

కోవిడ్ విస్తరణ సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహించిన తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న ఆశా వర్కర్లని పర్మినెంట్ చేయాలని, పెండింగులో వున్న బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆశా వర్కర్లు యూనియన్ నగర అద్యక్షురాలు పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి “అన్న ” అనే పిలుపుని కోల్పోయారని పేర్కొన్నారు.

Related posts