telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో విస్తరిస్తున్న కరోనా..సర్కారుపై దేవినేని ఫైర్

devineni on power supply

ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,732 మంది కొవిడ్‌ బారిన పడ్డారని ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాలు పలు దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీటిని పోస్ట్ చేస్తూ ఏపీ సర్కారుపై దేవినేని ఉమ మండిపడ్డారు.

మూడు లక్షలకు చేరువలో కేసులు, 2,500 దాటిన మరణాలు. రాష్ట్రంలో విస్తరిస్తున్నకరోనా. పరీక్షలు చేసిన వాళ్లలో 16.5 శాతం మందికి నిర్ధారణ. వైద్యం, వసతి సౌకర్యాలపై ప్రజల అసంతృప్తి. అనే కథనాలపై స్పందిస్తూ కరోనా కట్టడికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? అని ప్రశించారు. ఎక్కడెక్కడ ఎన్నినిధులు ఖర్చుపెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Related posts