ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కరోన బారిన పడ్డ విషయం తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆయన హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జోగేశ్వరరావు ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే అనేకమంది వైసీపీ నేతలకు కరోనా సోకింది. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, అంజాద్ బాషా, అంబటి రాంబాబు తదితరులు కరోనా బారిన పడ్డ విషయం విధితమే.