telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా పరీక్షలు : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  ఈ తరుణంలో కోవిడ్ నిర్ధారణ కోసం చేయించుకునే స్కానింగ్ ధరలను నియంత్రించింది ఏపీ ప్రభుత్వం. సీటీ స్కాన్, హెచ్చార్ సీటీ స్కాన్ ధరను రూ. 3 వేలకు మించి వసూలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. డయాగ్నస్టిక్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహాకులతో పాటు ఆస్పత్రుల్లోనూ సీటీ స్కాన్ నిమిత్తం రూ. 3 వేలకు మించి వసూలు చేయొద్దని సూచనలు చేసింది. ప్రభుత్వ ఆదేశాల అమలు విషయంలో నిరంతరం పర్యవేక్షించాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ వైద్యారోగ్య శాఖ. స్కానింగ్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

Related posts