telugu navyamedia
వార్తలు సామాజిక

లైట్ బీర్లు దొరుకుతలేవ్. అధికారులకు లేఖ రాసిన తాగుబోతుల సంఘం సభ్యులు.

మంచిర్యాల జిల్లాలలో కొన్నిరోజులుగా చల్లని బీర్లు దొరకట్లేదని తాగుబోతులంతా ఆందోళన చెందుతున్నారంటూ ఒక యువకుడు ఏకంగా ఎక్సైజ్ శాఖకు, ప్రభుత్వానికి లేఖ రాశారు.

మంచిర్యాల జిల్లాతోపాటు కరీంనగర్, జగిత్యాల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లోని వైన్స్ లో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకడం లేదని తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ లేఖలో పేర్కొన్నారు.

కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. సామాన్య ప్రజలుబైటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

అత్యవసకరమైతేనే బైటకు వెళ్తున్నారు. ఉద్యోగులు, ఇతర ప్రైవేటు రంగంవారు తప్పని సరిగా బైటకు వెళ్తున్నారు.

ఎండలో బైటకు వెళ్లే వారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలని కూడా నిపుణులు చెబుతున్నారు.

వేసవిలో కాస్త చల్లబడదామంటే యువకులకు, పెద్దలకు లైట్ బీర్లు ఏ వైన్ షాప్ కు వెళ్లినా దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఈ విషయాలన్ని పరిగణలోకి తీసుకొని అన్నీ వైన్ షాపుల్లో లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలని లేఖలో కోరారు.

అలా చేస్తే ప్రభుత్వ ఆదాయాన్ని ఇంకా రెట్టింపు చేస్తామని కొట్రంగి తరుణ్ ఎక్సైజ్ శాఖ అధికారులను కోరారు.

స్ట్రాంగ్ బీర్ తాగడం వల్ల.. తమకు కడుపులో మంట, తలనొపి, వాంతులు సమస్యలు వస్తున్నాయని, ఇలాంటి పరిస్థితులలో తమ ఆరోగ్యం పాడౌతుందంటూ కూడా ఆవేదన చెందుతున్నాడు.

లైట్ బీర్లలో ఆల్కహాల్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుందని వాటిని తాగి మా పని మేం చేసుకోగలమని ఆయన చెప్పుకొచ్చారు. అన్నీ జిల్లాల్లో కేఎఫ్ లైట్ బీర్ల స్టాక్ ఉండేలా చూడాలని ఈ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

Related posts