telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

తుపాకీతో బెదిరించి మణప్పురం ఫైనాన్స్‌లో చోరీ

manappuram finance

మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో పట్టపగలే చోరీ జరిగింది. ఇద్దరు దుండగులు తుపాకీతో బెదిరించి క్యాష్ కౌంటర్‌లోని నగదును దొంగిలించారు. ఈ ఘటన తుపాకులు చూపించడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి మణప్పురం కార్యాలయంలోకి ప్రవేశించారు. బంగారం తాకట్టు పెడతామని చెప్పి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని రాయదుర్గం బ్రాంచిలో జరిగింది.

ఘటన స్థలానికి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దోపిడీ దొంగల కోసం గాలింపుచర్యలు చేపట్టారు. కర్ణాటక సరిహద్దులోని చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో దుండగుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలను పరిశీలించారు.

Related posts