ఓ కసాయి హెడ్ కానిస్టేబుల్ పోలీసు స్టేషన్ ఆవరణలో తన కుమారుడిని దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని చౌరీ చోరా పోలీసు స్టేషన్లో చోటు చేసుకుంది. అర్వింద్ యాదవ్ అనే హెడ్ కానిస్టేబుల్కు ఇద్దరు భార్యలు ఉన్నారు. అయితే గత కొంత కాలం నుంచి మొదటి భార్యతో గొడవలు ఉన్నాయి.
అయితే మొదటి భార్య కుమారుడు పోలీసు స్టేషన్కు వచ్చాడు. దీంతో తండ్రి, కుమారుడి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశంగా ఉన్న కానిస్టేబుల్ అర్వింద్.. తన వద్ద ఉన్న తుపాకీతో కుమారుడిపై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అర్వింద్ను అదుపులోకి తీసుకున్నారు.