telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరుకి షేక్ హ్యాండ్ ఇచ్చిన దర్శకుడు… శానిటైజర్ వాడిన తరువాతే

chiru

నితిన్, రష్మిక మందన్న హీరో హీరోయిన్‌గా వెంకీ కుడుముల తెరకెక్కించిన చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమాను తాజాగా మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. వెంకీ కుడుములతో కలిసి సినిమాను చూశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ వెంకీ కుడుముల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చిరంజీవితో కలిసి తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. ‘‘నేను సినిమాల్లోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన నా దేవుడు, మెగాస్టార్‌తో కలిసి నా సినిమా చూడటం ఒక కల. ఆ కల ఈరోజు నిజమైంది. ‘భీష్మ’ సినిమాను చూడటమే కాకుండా మమ్మల్ని, మా కష్టాన్ని అభినందించినందుకు చిరంజీవి గారికి కృతజ్ఞతలు. మీ అభిమానిగా ఈ క్షణాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’’ అని తన మెసేజ్‌లో వెంకీ కుడుముల పేర్కొన్నారు. అయితే, వెంకీ కుడుముల షేర్ చేసిన ఒక ఫొటోలో చిరంజీవికి ఆయన షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిచెందుతోన్న నేపథ్యంలో ఈ షేక్ హ్యాంక్ గురించి ప్రత్యేకంగా ట్వీట్‌లో ప్రస్తావించారు. ‘‘చేతులకు శానిటైజర్ పూసుకున్న తరవాత చిరంజీవి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. దయచేసి ముందు జాగ్రత్తలు పాటించండి, భద్రతగా ఉండండి’’ అని వెంకీ పేర్కొన్నారు.

Related posts