ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత్ పై ఘనా విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్ విజయాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రికెట్ అభిమానులు, సెలబ్రిటీలు, మీడియా అంతా ఏకమై పాక్ ఆటగాళ్లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. భారత క్రీడాకారిణి, పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ భార్య సానియాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్కు ముందు రోజు షోయబ్ను సానియా రెస్టారెంట్కు తీసుకెళ్లిందని, భారత్ గెలవడం కోసమే సానియా అక్కడకు వెళ్లిందని ట్రోలింగ్ చేస్తున్నారు.
బాలీవుడ్ సినిమాల్లో నటించిన పాక్ నటి వీణా మాలిక్ కూడా సానియాను ట్విటర్ ద్వారా విమర్శించింది. కీలకమైన మ్యాచ్కు ముందు రోజు ప్రాక్టీస్ మానేసి బయటకు ఎలా వెళ్లారు. మ్యాచ్కు ముందు జంక్ఫుడ్ తినకూడదని స్వయంగా అథ్లెట్ అయిన సానియాకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ విషయామి సానియాకూడా ఘాటుగా స్పందించింది. నేను పాకిస్థాన్ క్రికెట్ జట్టు డైటీషియన్ను కాదు, వారికి టీచర్ను, ప్రిన్సిపల్ను కాదని సానియా ట్వీట్టర్ ద్వారా సమాదానమిచ్చింది.