కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో మార్చి 31వరకు రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ రోజు కేజ్రీవాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..రెస్టారెంట్లలో భోజనం చేయడంపై నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఆహారం తీసుకెళ్లడం, ఫుడ్డెలివరీ యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
సభలు, , సదస్సులు, ఇతర కార్యక్రమాల్లో 20 మంది లేదా ఆపైన ఒక్కచోట ఉండేందుకు అనుమతి లేదని కేజ్రీవాల్ చెప్పారు. విదేశాల నుంచి ఇండియాకు వచ్చినవారికి హోం క్వారంటైన్ స్టాంప్ వేయడం ప్రారంభించాం. కొంతమంది నేరుగా సూచనలు, నిబంధనలు పాటించకుండా ఇంటికెళ్లిపోతున్నారు. అవసరమైన వారు హోం క్వారంటైన్ పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.