telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైలు ప్రమాద ఘటనపై పవన్ సానుభూతి

pawan

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాద ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనలో మధ్యప్రదేశ్ వలస కూలీలు దుర్మరణం చెందడం బాధాకరమైన విషయమని పవన్ అన్నారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఈ దుర్ఘటనతో శ్రామిక్ రైళ్లకు సంబంధించిన సమన్వయ బాధ్యతలను చేపట్టడంలో రాష్ట్రాలు మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

Related posts