telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గ్యాస్ లీకేజ్ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలి: కన్నా

Kanna laxminarayana

విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజ్ ఘటన పై న్యాయ విచారణ జరిపించి, , దోషులను శిక్షించాలని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. తద్వారా శ్రామిక వర్గాల్లో ధైర్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలో బాధితులు పూర్తిగా కోలుకునే వరకూ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

బాధితుల విషయమై ఏపీ సీఎం జగన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే చిన్న గాయాలతో ఇబ్బంది పడి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన వారికి ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున, ఆసుపత్రిలో రెండుమూడ్రోజుల పాటు చికిత్స పొందిన వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

Related posts