telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ

cm jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మరో లేఖ రాశారు. రెవెన్యూ యంత్రాంగాన్ని పంపి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేయించాలని లేఖలో పేర్కొన్నారు రామకృష్ణ. నిన్న తాను అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించి, అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. అకాల, అధిక వర్షాల వల్ల వేరుశెనగ పంట కు పూర్తిగా నష్ట జరిగిందని తెలిపారు.

మరి కొన్ని పంటలు కూడా నీట మునగడంతో రైతాంగం కుదేలయిందని ఆవేదన వ్యక్తం చేసారు. వేలాది రూపాయలు అప్పులు తెచ్చి వేసిన పంటలు పోవటంతో రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు రామకృష్ణ. 2018-2019 కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ వెంటనే చెల్లించేందుకు చర్యలు చేపట్టండని డిమాండ్ చేసారు. తక్షణమే రెవిన్యూ, వ్యవసాయ మంత్రులను ఆయా జిల్లాల్లో పర్యటింప చేసి, రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు రామకృష్ణ. రైతులను ఆదుకోకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కూడా తెలిపారు.

Related posts