కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లను మూసివేయాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు స్వాగతించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మాకు ఆర్థికంగా నష్టం అన్నది వాస్తవమే అని పేర్కొన్నారు.
థియేటర్లు నడపకపోయినా అద్దెలు చెల్లించుకోవాలి. పన్నులు, విద్యుత్, ఇతర నిర్వహణ ఖర్చులు భరించాలి. దీనివల్ల ఆర్థికంగా చాలా భారాన్ని మోయాల్సి ఉంటుంది. అందుకోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరికాదు కదా. ఇటువంటి కష్టాలు ఏ పది పదిహేనేళ్లకోసారి వస్తుంటాయి. ఇటువంటి సందర్భాల్లో కరోనా పై మనమంతా సమష్టిగా యుద్ధం చేయక తప్పదని ఆయన అన్నారు