telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 3,48,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 4205 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 3,55,338 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,33,40,938 కాగా.. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 37,04,099 గా ఉన్నాయి. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 2,54,197 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 82.6 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 17.26 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.19శాతానికి మరణాల రేటు తగ్గింది.

Related posts