జమ్మూకశ్మీర్లో మరోసారి కాల్పుల మోతమోగింది. అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చాయి.
అనంత్నాగ్ జిల్లాలోని సంగం ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పోలీసులకు ముదస్తు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లారు. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి అక్కడ కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టి చేతులు ఎత్తేశారు: భట్టి విక్రమార్క