telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

2 terrorists killed in Jammu and Kashmir

జమ్మూకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోతమోగింది.  అనంత్‌నాగ్‌ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత బలగాలు హతమార్చాయి.

అనంత్‌నాగ్‌ జిల్లాలోని సంగం ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పోలీసులకు ముదస్తు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లారు. దీంతో శుక్రవారం సాయంత్రం నుంచి అక్కడ కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

Related posts