telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కెసిఆర్ సభను అడ్డుకుంటాం : ఉత్తమ్ వార్నింగ్

కెసిఆర్ సభ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ పై టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా.. ముఖ్యమంత్రి కెసిఆర్ సభనే అక్రమమని మండి పడ్డారు. రాజకీయాల కోసం కేసీఆర్ వస్తుంటే… కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేయడం ఏమిటీ.. ఇంత దౌర్జన్యమా ? అని నిలదీశారు. ఓట్ల కోసం కేసీఆర్ వస్తుంటే కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా కాంగ్రెస్ నాయకులను, జేఏసీ నాయకులను అరెస్ట్ చేసారని..ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని.. లేకపోతే కేసీఆర్ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా ఇవాళ సీఎం కెసిఆర్ బహిరంగ సభ హాలియాలో జరుగనుంది. ఈ సభ ఏర్పాట్లను టీఆర్ఎస్ కీలక నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు.

Related posts