telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హైకోర్టులో ఎంపీ కోమటిరెడ్డి పిటిషన్ దాఖలు…

తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.. కరోన కష్టకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ వేశారు.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో ప్రజలకు అవుతున్న ఖర్చు ప్రభుత్వం భరించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాల‌ని పేర్కొన్న ఆయ‌న‌.. ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు తీసుకున్న విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల‌న్నారు.. ఇక‌, ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో స‌రైన మౌలిక స‌దుపాయ‌లు లేవ‌న్న కోమ‌టిరెడ్డి.. కోవిడ్ కష్ట కాలంలో గత్యంతరం లేక జనం ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వెళ్తున్నార‌ని.. రాష్ట్రంలో ఉన్న చాలా ప్రైవేట్ ఆస్ప‌త్రులు జనాలను జలగల్లా పీడిస్తున్నార‌ని పిల్ ద్వారా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే తెలంగాణ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే.

Related posts