telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

టీలో మత్తు మందు కలిపి…పనిమనిషిని దారుణం

ఖమ్మంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఓ ఇంటి పనిమనిషిపై… ఆ ఇంటికి వచ్చిన బంధువులు ఆత్మాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను ఆ ఇంటి యజమాని ఏకంగా వీడియో తీసి.. పనిమనిషినే బెదిరించింది. అసలు వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలోని టీచర్స్‌ కాలనీకి చెందిన కాల్వ కళావతి ఇంట్లో ఓ మహిళ పనిచేస్తోంది. జనవరి 13న కళావతి ఇంటికి నలుగురు బంధువులు వచ్చారు. అయితే.. ఆ నలుగురి కన్ను ఆ ఇంటి పనిమనిషిపై పడింది. దీంతో ఇంటి యజమాని సాయంతో… టీ లో మత్తు మందు కలిపి పనిమనిషికి తాగించారు. తర్వాత వచ్చిన బంధువుల్లో ఒక్కడైన సయ్యద్‌ హుస్సేన్‌ పనిమనిషిని ఆత్యాచారం చేశారు. అయితే.. ఈ ఘటనను స్వయంగా ఇంటి యజమాని వీడియో తీసింది. అంతేకాదు… రూ. 5 లక్షలు ఇవ్వాలంటూ పనిమనిషి బెదిరించింది. లేకపోతే.. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగింది ఇంటి యజమాని. దీంతో విసిగిపోయిన ఆ పనిమనిషి… పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… సయ్యద్‌ హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా.. ఇంటి యజమానిక కళావతి గతంలోనూ ఓ వ్యాపారికి వలపు వల వేసి… రూ. 10 లక్షలు డిమాండ్‌ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలోనూ కళావతిపై కేసు బుక్‌ చేశామని పోలీసులు పేర్కొన్నారు.

Related posts