telugu navyamedia
తెలంగాణ వార్తలు

మునుగోడు పాద‌యాత్ర‌కు రేవంత్‌రెడ్డి దూరం..కారణం ఇదే

*మునుగోడు పాద‌యాత్ర‌కు రేవంత్‌రెడ్డి దూరం
*క‌రోనా ల‌క్ష‌ణాల‌తో సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి ఉన్నా..
*అనారోగ్య కార‌ణాల‌తో పాద‌యాత్ర‌కు రేవంత్ దూరం

మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి .మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.దీంతో అన్ని పార్టీలు ఉప ఎన్నికల కసరత్తును ప్రారంభించాయి.

ఈ నేపథ్యంలో నారాయణపురం నుంచి చౌటప్పల్‌ వరకు కాంగ్రెస్‌ పాదయాత్ర తల పెట్టింది. ఈ పాదయాత్రకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దూరంగా ఉన్నారు. కరోనా లక్షణాలతో ఆయన సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా పరీక్షకు శాంపిల్స్‌ను పంపించారు. 

మునుగోడు పాద‌యాత్ర‌కు ఆఖరిని నిమిషలో ఈ నిర్ణయం తీసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే పాదయాత్రకు దూరం కావడంతో.. కాంగ్రెస్ రాజకీయాలు మళ్లీ రచ్చకెక్కాయి.

.

Related posts