telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

అడవులు కూడా .. దత్తత తీసుకుంటున్న తెరాస నేతలు..

trs mp adopted forest in kirasagutta

కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కీసరగుట్ట రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఎంపీ నిధులతో 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాజెక్టుగా మార్చి హైదరాబాద్ వాసులకు గిఫ్ట్‌గా ఇస్తానన్నారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. అటవీ ప్రాంతాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలంటూ కేటీఆర్‌, కవిత, దర్శకుడు పైడిపల్లి వంశీ, నటులు దేవరకొండ విజయ్‌, నితిన్‌, పారిశ్రామికవేత్త ముత్తా గోపాల్‌ను ట్యాగ్‌ చేశారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంపై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్ దత్తత నిర్ణయాన్ని ప్రకటించారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి పార్కులు ఎంతగానో తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు.

Related posts