*కోమటిరెడ్డికి మరోసారి క్షమాపణలు చెబుతున్నా
*క్రమశిక్షణ కమిటీ షోకేజ్ నోటీసులు ఇచ్చింది..
పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా..
*నోటీసులకు సమాధానం ఇచ్చా..
కోమటిరెడ్డికి రాత పూర్వకంగా క్షమాపణ చెప్పా.
మునుగోడు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ శనివారం మరోసారి క్షమాపణలు తెలిపారు.
ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. చండూరు సభలో తాను చేసిన వాఖ్యలకు భాదపడుతున్నట్లు తెలిపారు. నాయకులు అంతా కలిసికట్టుగా పని చేయాలనేది తన ఉద్దేశం అని, చండూరు సభలో తాను చేసిన వ్యాఖ్యలపై రాతపూర్వకంగా కూడా క్షమాపణ తెలియజేశాను అని అద్దంకి పేర్కొన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌనత్యంతో తన తరుపున క్షమాపణ చెప్పారన్నారు. సోదర భావంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కోసం పనిచేయాలని అద్దంకి దయాకర్ కోరారు.
అలాగే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.. క్రమశిక్షణ కమిటీ నాకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. నోటీసులకు వివరణ ఇచ్చా.. క్షమాపణ కూడా చెప్పా. భవిష్యత్లో మరోసారి అలా జరగకుండా చూసుకుంటాను’ అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు