సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. తమిళిసై బాబాయి మృతి చెందడంతో కేసీఆర్ పరామర్శించారు. అసెంబ్లీ సమావేశాలు, కరోనాపై కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కావాలని మంత్రులు, అధికారులను కేసీఆర్ కోరారు.
అసెంబ్లీ సమావేశాల్లో పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశ పెట్టడంతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి సిద్ధం కావాలని కోరారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా అసెంబ్లీ హాలులో ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
చంద్రబాబు అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేస్తున్నాడు: ఏపీ మంత్రులు