ఆర్టీసీ కార్మికులంతా పోరాటానికి సిద్ధం కావాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మెకు దిగనున్నట్టు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సోమేశ్ కుమార్ కమిటీతో జరిగిన చర్చల్లో ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని చెప్పారు. సమస్య పరిష్కారం దిశగానే తాము కూడా ఆలోచిస్తున్నామని తెలిపారు. అయితే తమ డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వం కూడా కృషి చేయాలని అన్నారు.
గతంలో కూడా ప్రభుత్వం కమిటీలను వేసిందని, అవి నివేదికలు ఇవ్వలేదని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో పాటు తమ 26 డిమాండ్లను పరిష్కరించేంత వరకు పోరాడతామని తెలిపారు. తమ డిమాండ్లలో 2, 3 అంశాలు తప్ప మిగిలిన అంశాలన్నీ పరిష్కరించేవేనని చెప్పారు.