ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్న తర్వాత తొలిసారి భారత్-ఇంగ్లండ్ సిరీస్ల్లో బాధ్యతలు నిర్వర్తించిన అంపైర్ నితిన్ మీనన్.. మంచి నిర్ణయాలతో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇండోర్కు చెందిన 37 ఏళ్ల నితిన్.. గతేడాది జూన్లోనే ఎలైట్ ప్యానెల్కు ఎంపికయ్యాడు. అయితే ఈ సీరిస్ లో తన 40 నిర్ణయాలను సవాలు చేస్తూ ఇరు జట్ల కెప్టెన్లు సమీక్ష కోరగా అందులో కేవలం 5 మాత్రమే నితిన్కు వ్యతిరేకంగా వచ్చాయి. ఇక ఎల్బీల విషయంలో 35 సమీక్షలకు గాను రెండు మాత్రమే ప్రతికూలంగా వచ్చాయి. ప్రస్తుతం ఐపీఎల్-14వ సీజన్కు సిద్ధమవుతున్న అతను చెన్నైలో క్వారంటైన్లో ఉన్నాడు. ఈ సందర్బంగా అతను మాట్లాడుతూ… ‘గత రెండు నెలలు గొప్పగా గడిచాయి. మనం సమర్థంగా చేసిన పనిని ప్రజలు గుర్తించి, అభినందిస్తే గొప్ప సంతృప్తి కలుగుతుంది. వరుసగా మ్యాచ్ల్లో విధులు నిర్వర్తించడం నాకు కొత్తేమీ కాదు. దేశవాళీ, ఐపీఎల్ మ్యాచ్ల అనుభవం ఈ సిరీస్లో ఉపయోగపడింది. ఆటగాళ్లలాగే అంపైర్లూ ఫామ్లో ఉంటారు. నేను మంచి ఫామ్లో ఉన్నపుడు ఎలాంటి విరామం లేకుండా వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లకు పనిచేయాలని అనుకుంటా. అంపైర్గా నా పనిని ఆస్వాదిస్తుంటా” అని నితిన్ చెప్పుకొచ్చాడు
previous post
next post
చంద్రబాబుకు అభివృద్ధి గురించి ఏం తెలుసు: మంత్రి బొత్స