telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నా ఫోన్ ట్యాప్ చేస్తారనే భయం కలుగుతోంది: రఘురామకృష్ణరాజు

Raghuramakrishnaraju ycp mp

వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ రెబల్ ఎంపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తనతో సన్నిహితంగా మెలుగుతున్న వైసీపీ ఎంపీలను కూడా పార్టీ నాయకత్వం సున్నితంగా బెదిరించిందని రఘురాజు తెలిపారు.

తన ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తారనే భయం తనకు ఉందని రఘురామ చెప్పారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తనను పిలవలేదని తెలిపారు. ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ కు తాను ఫిర్యాదు చేస్తానని అన్నారు.

అమరావతి భూములపై వేసిన సిట్ విచారణపై హైకోర్టు స్టే ఇవ్వడం మంచి పరిణామమని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఎందరో భూములు కొన్నారని చెప్పారు. ఇప్పుడు వారందరి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

ఏపీలోని హిందూ దేవాలయాలపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయని ఆయన ప్రభుత్వాన్ని ప్రశించారు. కనకదుర్గమ్మ ఆలయంలోని రథానికి ఉన్న మూడు వెండి సింహాలు కనిపించకుండా పోవడం దురదృష్ణకరమని అన్నారు.

Related posts