telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

సీఎం కేసీఆర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే విమర్శలు…

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఏకంగా సీఎం కేసీఆర్ పైనే విమర్శలు గుప్పించారు. అయితే ఈయన గాథలో కూడా ఇలా ఓ సారి టీఆర్ఎస్ నాయకుల పైన విమర్శలు చేసారు. కానీ ఇప్పుడు ఏకంగా కేసీఆర్ పైనే చేయడంతో తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ, గతకొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తున్నా పట్టించుకోని పుణ్యాత్ముడు ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్ అని వ్యాఖ్యానించారు.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. అయితే, ధర్మారెడ్డి పొరపాటున సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చేసిన వ్యాఖ్యల్లో ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ చల్లా విమర్శలు గుప్పించారు.. ఈరోజు రైతాంగం ఇబ్బందులు పడుతుంటే, వారిని పిలిచి మాట్లాడకపోవడం మంచి పద్దతి కాదన్నారు ధర్మారెడ్డి. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నాయి.

Related posts